Breaking News

గుదిబండలా విద్యుత్​ బిల్లులు

పెరిగిన విద్యుత్​ బిల్లులకు నిరసనగా ధర్నా చేస్తున్న బీజేపీ నేతలు

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: పెరిగిన విద్యుత్​చార్జీలు ప్రజలకు గుదిబండలా మారాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ విమర్శించారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని టీఎస్​ఎన్పీడీసీఎల్​ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోనేరు మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విద్యుత్​ బిల్లులు మరింత భారంగా మారాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిలుకూరి రమేష్, ఎర్రం రాజు, సీతారాంనాయక్, హనుమంతరావు, లక్ష్మణ్ అగర్వాల్, శ్రీనివాస్ కుమార్, నోముల రమేశ్​, కోనేరు నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరావు, మొగిలిపాక రవి, శ్రీను, సత్యనారాయణ, హరిహరన్​ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.