Breaking News

గర్భిణులు పోషకాహారం తీసుకోవాలే

గర్భిణులు పోషకాహారం తీసుకోవాలే

సారథి న్యూస్, మెదక్: గర్భిణులు, బాలింతలను రక్తహీనత నుంచి కాపాడేందుకు ప్రభుత్వం పోషక పదార్థాలు అందిస్తోందని మెదక్ ​జిల్లా అడిషనల్​ కలెక్టర్ నగేష్ ​అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్​లో పోషణ్​ అభియాన్ ​కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్​వాడీ కేంద్రాలు, టీచర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. గర్భిణులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనతపై మహిళా సంఘాలు, అంగన్​వాడీ టీచర్లు, టీచర్లు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిఒక్కరూ తాము తీసుకునే ఆహారపు అలవాట్లు, విధానాలను మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా, శిశుసంక్షేమశాఖ జిల్లా అధికారిణి రసూల్​బీ, డీఎంహెచ్​వో డాక్టర్​ వెంకటేశ్వర్​రావు, డీఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రమేష్​కుమార్, సీపీవో శ్రీనివాసులు, ఐసీడీఎస్​ సీడీపీవోలు హేమభార్గవి, భార్గవి, స్వరూప పాల్గొన్నారు.