Breaking News

గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు నగరంలో ఈనెల 30న జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగం, పోలీస్, ఫిషరీస్, విద్యుత్ అధికారులు, నగర గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులతో కలిసి వినాయక్ ఘాట్ ను పరిశీలించారు. నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్ వద్ద ఉన్న మెట్లకు మరమ్మతు పనులు చేయాలని సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్​ కార్పొరేషన్​ ఎస్ఈ సురేంద్రబాబు, హెల్త్​ఆఫీసర్​ భాస్కర్ రెడ్డి, డీఈ రసూల్, ఏఈలు జనార్దన్, రాచయ్య, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులు కపీలేశ్వరయ్య, రంగస్వామి, కిష్టన్న ఉన్నారు.