Breaking News

క్షౌరశాలలకు అనుమతి

క్షౌరశాలలకు అనుమతి

సారథి న్యూస్, అనంతపురం: లాక్‌డౌన్‌ మూడో దశలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా రెడ్‌ జోన్లు మినహాయించి గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు తెరుచుకోవచ్చని శనివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.