Breaking News

కోలుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం

కోలుకుంటున్న బాలు

చెన్నై: కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఆయనకు ఇంకా వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలుకయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ప్రకటించారు.

బాలూ.. తొందరగా రా..
బాలు ఆరోగ్యం విషమించినట్లు తెలియగానే మాస్ట్రో ఇళయరాజా కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘బాలు తొందరగా లేచిరా. మన జీవితం కేవలం సినిమాతో ముగిసిపో యేది కాదు. సినిమాతో ప్రారంభమైనది కూడా కాదు. ఎక్కడో స్టేజీల్లో ఇద్దరం కలిసి ప్రారంభించిన సంగీత కచేరీలోని సంగీతం మన జీవితంగానూ, మనకు ముఖ్యమైన జీవితాధారంగా మారింది. ఆ స్టేజీ కచేరీల్లో ప్రారంభమైన మన స్నేహం, సంగీతం, స్వరాలు ఎలా ఒకటికి ఒకటికి ఎలా పెనవేసుకుని ఉంటాయో అలా మన స్నేహం ఏనాడు చెదిరిపోలేదు. మనం తగవులు వేసుకున్నపుడు స్నేహమే, తగవులు లేన ప్పుడూ స్నేహమే అనే సంగతి నీకూ నాకూ తెలుసు. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు.