సారథిన్యూస్, మానోపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలో ఇండ్లు, ఆస్తుల నమోదు కార్యక్రమం కొనసాగుతున్నది. ఆదివారం జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి ముషాహీదా బేగం మానోపాడులో పర్యటించి నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇండ్లు, ఆస్తుల నమోదుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, తమ ఆస్తులు ఆన్లైన్లో వచ్చేలా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలో నారాయణపురం, పెద్ద ఆముదాలపాడ్, చిన్న పోతుల పాడ్, పెద్ద పోతుల పాడ్, చంద్రశేఖర్ నగర్ గ్రామాల్లో జజరుగుతున్న ఇండ్ల నమోదును ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, హరిత, ప్రభాకర్ పాల్గొన్నారు.
- October 5, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HYDERABAD
- KCR
- KTR
- TELANGANA
- కేటీఆర్
- కేసీఆర్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on కొనసాగుతున్న ఇండ్లు, ఆస్తుల నమోదు