Breaking News

కొట్రలో కరోనా కలవరం

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఓ యువ డాక్టర్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం వైద్యాధికారులు గ్రామానికి వచ్చి ఆయనతో కాంటాక్ట్ ​అయిన వారి వివరాలు ఆరాతీశారు. సదరు డాక్టర్​ప్రస్తుతం హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కరోనా రోగులకు వైద్యచికిత్సలు అందించే వైద్యుల బృందంలో గత మూడు నెలలుగా ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోగులకు ట్రీట్​మెంట్​ అందించే క్రమంలో కరోనా మహమ్మారి ఆయనకు కూడా అంటుకోవడం పట్ల కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

అయితే సదరు యువ డాక్టర్​కు వైద్యం పరంగా మంచిపేరుంది. ప్రమాదాలు, అత్యవసర ఆపరేషన్లు, ఇతర ఆపద సమయాల్లో ట్రీట్​మెంట్​ కోసం గాంధీ ఆస్పత్రికి ఎవరిని తీసుకెళ్లినా దగ్గరుండి మరీ వైద్యచికిత్సలు చేయించేవారని గ్రామస్తులు చెబుతున్నారు. భగవంతుడి దయతో త్వరగా కోలుకోవాలని స్థానికులు కోరుతున్నారు.