Breaking News

కేఎల్​ రాహుల్​ సెంచరీ.. పంజాబ్​ ఘనవిజయం

దుబాయ్: ఐపీఎల్​13 సీజన్​లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ చాలెంజర్స్‌ ఘోరంగా ఓటమి పాలైంది. 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చతికిలపడింది. ఓపెనర్లు, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్ మెన్లు విఫలమవడంతో ఆర్సీబీ 97 రన్స్​తేడాతో ఓటమిని చవిచూసింది. ఆర్సీబీ ఆటగాళ్లలో ఫించ్‌(20), డివిలియర్స్‌(28), వాషింగ్టన్‌ సుందర్‌(30), శివం దూబే(12) రెండంకెల స్కోరు మాత్రమే చేయగలిగారు. ఇక కింగ్స్‌ ఎలెవన్ ​పంజాబ్‌ బౌలర్లలో రవి బిష్నోయ్‌, మురుగన్‌ అశ్విన్‌ చెరో మూడు వికెట్ల చొప్పున సాధించగా, షెల్డాన్‌ కాట్రెల్‌ రెండు వికెట్లు తీశాడు. ఇక షమీ, మ్యాక్స్‌వెల్‌ ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు. తొలుత బ్యాటింగ్​కు దిగిన కింగ్స్‌ ఎలెవన్ ​పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెలరేగిపోయాడు. 62 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ పూర్తిచేశాడు. రాహుల్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోహ్లి వదిలేయడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 132 పరుగులు సాధించి టాప్​ స్కోరర్​గా నిలిచాడు. ఎంఏ అగర్వాల్ 26(20 బంతుల్లో), ఎన్​పూరన్​ 17(18 ంతుల్లో), కేకే నాయర్​15( 8 బంతుల్లో.. నాటౌట్) చొప్పున నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లు ఎస్​దుబే రెండు, వైఎస్​చాహల్​ఒక వికెట్​చొప్పున తీశారు. ఇక ప్లేయర్​ ఆఫ్​ది మ్యాచ్​గా కేఎల్​ రాహుల్ నిలిచాడు.