![కృష్ణానదిలో మహిళ గల్లంతు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/krishna-2f.jpg?fit=677%2C320&ssl=1)
సారథి న్యూస్, మానవపాడు: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 26వ వార్డు కాలనీకి చెందిన ఓ మహిళ నదిఅగ్రహారం వద్ద కృష్ణానదిలో స్నానం చేసేందుకు వెళ్లి కొట్టుకుపోయింది. ఈ సంఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. ఆమె జాడ కోసం గజ ఈతగాళ్ల సాయంతో వెతుకుతున్నారు. ఎస్సై సత్యనారాయణ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.