Breaking News

కూంబింగ్​ అందుకోసమేనా?

కూంబింగ్​అందుకోసమేనా?
  • దండకారణ్యంలో విస్తృతంగా తనిఖీలు
  • భారీ సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపు

సారథి న్యూస్, వాజేడు: కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న దండకారణ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టులు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న ఇంటలిజెన్స్​సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో కలవరం నెలకొంది. ములుగు జిల్లా, చత్తీస్​గఢ్ ​సరిహద్దు ప్రాంతంలో కొద్దిరోజులుగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు కుంబింగ్ ​నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో సివిల్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు నేషనల్​ హైవే నం.163పై తనిఖీలు నిర్వహించాయి. అంతర్రాష్ట్ర సరిహద్దు టేకులగూడెం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితుల వద్ద ఆధార్​కార్డు, వాహనాల రిజిస్ట్రేషన్​పేపర్లు, డ్రైవింగ్​లైసెన్స్ ను పరిశీలించి పంపిస్తున్నారు. ఈ తనిఖీల్లో పేరూరు ఎస్సై బండి హరికృష్ణ, వాజేడు ఎస్సై తిరుపతి రావు, సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.