![కరోనా నియంత్రణలో విఫలం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/OSMA-2F.jpg?fit=680%2C499&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆరేళ్లలో వారసత్వ కట్టడాల మరమ్మతులకు ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కొత్త భవనం నిర్మాణానికి ఉస్మానియా ఆస్పత్రి వెనుక ఆరెకరాల విస్తీర్ణంలో స్థలం ఉందన్నారు. ఉస్మానియాను సందర్శించిన వారిలో కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్అంజన్కుమార్ యాదవ్, ఫిరోజ్ఖాన్, ఉస్మాన్రాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్యాదవ్, మెట్టుసాయి తదితరులు ఉన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/uttam-3.jpg?resize=640%2C223&ssl=1)