Breaking News

కరోనా కేసుల్లో కొత్తరికార్డు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.గత 24 గంట్లో కొత్తగా 78,761 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో 948 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటివరకు 63,498 మంది కరోనా బారినపడి చనిపోయారు. 27,13,934 కోలుకోగా.. 7,65,302 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 4,14,61,636 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.