Breaking News

కరోనాతో మాజీ క్రికెటర్ కన్నుమూత

కరోనాతో మాజీ క్రికెటర్ కన్నుమూత

న్యూఢిల్లీ: కరోనా మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. ఢిల్లీ క్లబ్ మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ (53).. వైరస్ బారినపడి మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. దోబల్ పెద్ద కుమారుడు సిద్ధాంత్.. రాజస్థాన్ తరఫున ఫస్ట్​క్లాస్​ క్రికెట్ ఆడుతుండగా, చిన్న కుమారుడు ఎకాన్ష్ ఢిల్లీ అండర్–23 టీమ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్లబ్ క్రికెట్​లో ప్రముఖ క్రికెటర్​గా ఉన్న దోబల్.. ఢిల్లీ అండర్–23 టీమ్​కు సహాయక సిబ్బందిగా కూడా పనిచేశాడు. దీర్ఘకాల వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న సమయంలో దోబల్ వైరస్ బారిన పడినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మూడు వారాల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని బహుదూర్ రోడ్ లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పాజిటివ్​గా తేలడంతో మంచి వసతులు ఉన్న ద్వారక ఆస్పత్రికి తరలించి ప్లాస్మా చికిత్స అందజేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది.