Breaking News

కత్తులు, కర్రలతో దాడులు

కత్తులు, కర్రలతో దాడులు

సారథి న్యూస్​, కర్నూలు: పొలం తగాదా విషయంలో ఇద్దరు సోదరులు, వారి వర్గం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటన శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామంలో సంచలనం రేపింది. గ్రామంలోని పెద్ద అయిలప్ప, పెద్దయ్య మధ్య భూ వివాదం నెలకొంది. ఓ వర్గం వారు పొలం దున్నడానికి వెళ్లగా, మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో మొదలై ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఇందులో పెద్ద అయిలప్ప కుటుంబంలో 11 మందికి, పెద్దయ్య కుటుంబంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.