Breaking News

కడప- బెంగళూరు బస్సులకు బ్రేక్​

కడప- బెంగళూరు బస్సులకు బ్రేక్​

కడప: కడప- బెంగళూరు మధ్య ఆదివారం నడిచే బస్సు సర్వీసులు ఇక నుంచి నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూటులో బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డబ్బులు రిటన్ చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్ ఉన్నందున రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మిగతా రోజుల్లో సదరు రూటులో ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి.