Breaking News

ఐటంగర్ల్​తో దావూద్​ ఎఫైర్​

ఐటంగర్ల్​తో దావూద్​ ఎఫైర్​


కరాచీ: అండర్​ వరల్డ్​ డాన్​, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్​ ఇబ్రహీం పాకిస్థాన్​కు చెందిన ఓ సినీనటితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్​కు చెందిన మెహ్విష్​ హయత్​ (37) మొదట ఐటం గర్ల్​గా కెరీర్​ను ప్రారంభించింది. అనంతరం పలు సినిమాల్లో నటించింది. ఆమెతో దావూద్​ సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఇండియా నుంచి పారిపోయిన దావూద్​ పాకిస్థాన్​లోని కరాచీలో ఓ భారీ బంగ్లాలో నివాసం ఉంటున్నాడు. దావూద్​కు పాక్​ చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తులు, రియల్ ​వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

మెహ్విష్​ హయత్​తో దావూద్​ చాలా సన్నిహితంగా ఉంటాడని ఆమెతో తరుచూ ఫోన్​లో మాట్లాడతాడని తాజాగా వెల్లడైంది. ముంబైలో ఉన్నప్పుడు కూడా దావూద్​కు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉండేవి.. పాక్​లోనూ దావూద్​ ఇదే పంథాను కొనసాగించాడు. అయితే మొదట్లో చిన్ననటిగా ఉన్న మెహ్విష్​ దావూద్​ ప్రోత్సాహంతో స్టార్​ హీరోయిన్​గా ఎదిగిందని సమాచారం. దావూద్​ బెదిరింపులకు భయపడి ప్రముఖనిర్మాతలంతా ఆమెకు అవకాశం కల్పించారు. దావూద్​ అక్కడి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి మెహ్విష్​కు ‘తమ్గా ఇంతియాజ్’ అనే పురస్కారం కూడా ఇప్పించారని కథనాలు వచ్చాయి.