Breaking News

ఏసీబీకి చిక్కిన సీఐ

సారథిన్యూస్​, చేవెళ్ల: భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్​ సీఐ శంకరయ్య ఓ వ్యక్తికి సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. లక్ష 20వేలు లంచం డిమాండ్​ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం షాబాద్​ పీఎస్​లో శంకరయ్య యాదవ్​, ఏఎస్సై రాజేందర్..​ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. సీఐ శంకరయ్యపై గతంలోనూ అవినీతి కేసులున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో పనిచేసినప్పడు అవినీతి ఆరోపణలు రావడంతో అతడిని సైబరాబాద్​ కమిషనరేట్​ కార్యాలయానికి అటాచ్​ చేశారు. అనంతరం ఇటీవలే షాబాద్​కు సీఐగా పంపించారు. అయినప్పటికీ ఈ ఖాకీ బుద్ధి మారలేదు.