Breaking News

ఏసీబీకి చిక్కిన అధికారి

సారథిన్యూస్​, రంగారెడ్డి: లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ కో​​​- ఆర్డినేటర్​గా పనిచేస్తున్న రఘునాథ్​ ఆరోగ్యశ్రీలో ఓ డెంటల్​ హాస్పిటల్​ను రెన్యువల్​ చేసేందుకు రూ. 30, 000 డిమాండ్​ చేశాడు. 25,000 వేలకు బేరం కుదిరింది. అనంతరం హాస్పిటల్​ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన అధికారులు సోమవారం రఘునాథ్​.. లంచం తీకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.