![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/ACBFF.jpg?fit=800%2C448&ssl=1)
సారథిన్యూస్, రంగారెడ్డి: లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ కో- ఆర్డినేటర్గా పనిచేస్తున్న రఘునాథ్ ఆరోగ్యశ్రీలో ఓ డెంటల్ హాస్పిటల్ను రెన్యువల్ చేసేందుకు రూ. 30, 000 డిమాండ్ చేశాడు. 25,000 వేలకు బేరం కుదిరింది. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన అధికారులు సోమవారం రఘునాథ్.. లంచం తీకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.