![ఏపీలో 10,825 కరోనా కేసులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/CARONA-TEST-2F-1.jpg?fit=275%2C183&ssl=1)
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శనివారం(24గంటల్లో) 10,825 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,87,331కు చేరింది. కొత్తగా 71 మంది కరోనా వ్యాధితో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,347కు చేరింది. 24 గంటల్లో 11,941మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 3,82,104 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 69,326 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 40,35,317 శాంపిళ్లను టెస్ట్చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,210 యాక్టివ్ కేసులు రికార్డు అయ్యాయి.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/ap-CAROAN-REPORT.jpg?resize=580%2C402&ssl=1)
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 549, చిత్తూరు 938, ఈస్ట్గోదావరి 1399, గుంటూరు 641, కడప 1039, కృష్ణా 337, కర్నూలు 433, నెల్లూరు 1046, ప్రకాశం 1332, శ్రీకాకుళం 601, విశాఖపట్నం 765, విజయనగరం 642, వెస్ట్గోదావరి 1103 చొప్పున పాజిటివ్కేసుల నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.