Breaking News

ఏపీలో 10,392 కరోనా కేసులు

ఏపీలో 10,392 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం(24 గంటల్లో) 10,392 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,55,531 నమోదయ్యాయి. తాజాగా, కరోనా మహమ్మారి బారినపడి 72 మంది మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,125కు చేరింది. కోవిడ్​నిర్ధారణ పరీక్షలు 38లక్షలు దాటాయి. నిన్న ఒక్కరోజే 60,804 మెడికల్​ టెస్టులు చేయగా, ఇప్పటివరకూ చేసిన టెస్టులు 38,43,550 చేశారు. తాజాగా కరోనా నుంచి 8,454 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వ్యాధి నుంచి కోలుకుని 3,48,330 మంది ఇంటిబాటపట్టారు. రాష్ట్రంలో యాక్టివ్​కేసులు ప్రస్తుతం 1,03,076 మేర ఉన్నాయి.

ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​

జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 810, చిత్తూరు 1,124, ఈస్ట్​గోదావరి 1,199, గుంటూరు 900, కడప 800, కృష్ణా 397, కర్నూలు 697, నెల్లూరు 942, ప్రకాశం 800, శ్రీకాకుళం 603, విశాఖపట్నం 675, విజయనగరం 560, వెస్ట్​గోదావరి 885 చొప్పున పాజిటివ్​కేసుల నమోదు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​లో పేర్కొంది.