Breaking News

ఏపీలో రెడ్‌జోన్‌ మండలాలివే..

ఏపీలో రెడ్‌జోన్‌ మండలాలివే..
  • ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

సారథి న్యూస్​, అనంతపురం: కరోనా(కోవిడ్-19) తీవ్రతను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించింది. వాటికి రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్ అని పేర్లు పెట్టింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించింది. తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్, కేసులు నమోదుకాని ప్రాంతాలను గ్రీన్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లలో ఈనెల 4వ తేదీ నుంచి లాక్‌ డౌన్‌ లో కాస్త సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెడ్ జోన్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేసింది. ఎప్పటిలాగానే లాక్ డౌన్ కొనసాగుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెడ్ జోన్ లో ఉన్న మండలాలను ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

కర్నూలు జిల్లా : కర్నూలు (పట్టణ), నంద్యాల, బనగానపల్లి గ్రామీణ, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (పట్టణ), నందికొట్కూరు (పట్టణ), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (పట్టణ), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (పట్టణ)

నెల్లూరు జిల్లా: నెల్లూరు(పట్టణ), నాయుడుపేట (పట్టణ), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు (పట్టణ), కావలి (పట్టణ), కోవూరు, ఓజిలి, తోటపల్లిగూడూరు

గుంటూరు జిల్లా: గుంటూరు (పట్టణ), నరసరావుపేట, మాచర్ల (పట్టణ), అచ్చంపేట గ్రామీణ, మంగళగిరి (పట్టణ), పొన్నూరు (పట్టణ), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (పట్టణ)

పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు (పట్టణ), పెనుగొండ గ్రామీణ, భీమవరం (పట్టణ), తాడేపల్లిగూడెం (పట్టణ), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (పట్టణ), నరసాపురం (పట్టణ)

ప్రకాశం జిల్లా: ఒంగోలు (పట్టణ), చీరాల (పట్టణ), కారంచేడు, కందుకూరు (పట్టణ), గుడ్లూరు, కనిగిరి (పట్టణ), కొరిసపాడు, మార్కాపురం (పట్టణ), పొదిలి

తూర్పుగోదావరి జిల్లా: శంఖవరం గ్రామీణ, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (పట్టణ), రాజమండ్రి (పట్టణ), అడ్డతీగల, పెద్దాపురం (పట్టణ), రాజమహేంద్రవరం గ్రామీణ

చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు

వైఎస్సార్ కడప జిల్లా: ప్రొద్దుటూరు(పట్టణ), కడప(పట్టణ), బద్వేలు (పట్టణ), పులివెందుల(పట్టణ), మైదుకూరు (పట్టణ), వేంపల్లె, ఎర్రగుంట్ల (పట్టణ)

కృష్ణా జిల్లా: విజయవాడ (పట్టణ), పెనమలూరు గ్రామీణ, జగ్గయ్యపేట (పట్టణ), నూజివీడు (పట్టణ), మచిలీపట్నం (పట్టణ)

అనంతపురం జిల్లా: హిందూపురం (పట్టణ), అనంతపురం (పట్టణ), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు

విశాఖపట్నం జిల్లా: విశాఖ (పట్టణ), పద్మనాభం, నర్సీపట్నం(పట్టణ) ఉన్నాయి.