Breaking News

ఏపీలో బీజేపీ జెండా ఎగరవేస్తాం

ఏపీలో బీజేపీ జెండా ఎగరవేస్తాం

సారథి న్యూస్, కర్నూలు: ప్రతి ఒక్కరి అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యదర్శి మధుకర్ జి, బైరెడ్డి శబరి, రాష్ట్ర కార్యదర్శి హరీశ్ బాబు, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు రామస్వామి, పార్టీ నాయకులతో కలిసి పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇంటింటికి తిరిగి దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్రమోడీ 2.0 ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు.

దేశంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రధాని మోడీ నిర్వీరామంగా కృషిచేస్తున్నారన్నారు. మోడీ నాయకత్వంలో రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ జెండాను ఎగరవేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ సుబ్బారెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు జీఎస్ నాగరాజు, వేముల శ్రీధర్, సుందర్ రెడ్డి, చల్లా దామోదర్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు రామకృష్ణ, లక్ష్మీపురం గ్రామస్తులు బాబు, వాసు పాల్గొన్నారు.