![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/BJPPPP.jpg?fit=699%2C391&ssl=1)
సారథి న్యూస్, రామడుగు/ రామాయంపేట /చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పేద ప్రజలకు గుదిబండ అని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు మురళి విమర్శించారు. ఎల్ఆర్ఎస్ను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో తీసుకొచ్చిన జీవో 131 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ నేతలు ధర్నా చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలకేంద్రంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ నేతలు నరేందర్ రెడ్డి, దశరథం,ఆకుల రాజు, శంకర్, స్వామి, సయ్యద్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. రాజి రెడ్డి, బాజా శేఖర్, వినయ్ కుమార్, ఒంటెల కర్ణాకర్, ఓబీసీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పొన్నం శ్రీను, తిర్మలపూర్ ఎంపీటీసీ మోడీ రవి, యువ మోర్చా మండల అధ్యక్షుడు దురుశెట్టి రమేష్, దళిత మోర్చ అధ్యక్షుడు చంటి జితేందర్, నాయకులు ఉప్పు రాం కిషన్, నర్సింగ రావు, కొత్త వెంకటేశ్, అంజిబాబు, పీ చంద్రమౌళి, పోచంపల్లి నరేశ్, ఏం శ్రీనివాస్, అజయ్ రెడ్డి, పురేళ్ల శ్రీకాంత్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.