![‘ఎడ్మ’ ఫ్యామిలీని పరామర్శించిన మంత్రి, ఎంపీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/yadma2.jpg?fit=677%2C359&ssl=1)
సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత ఎడ్మ కృష్ణారెడ్డి కుటుంబాన్ని కల్వకుర్తిలోని వారి నివాసంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ పి.రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తదితరులు ఆదివారం పరామర్శించారు. ఎడ్మ కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సతీమణి పుష్పలత, కొడుకు కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి వెంట ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్నిజాంపాషా, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు టీఎస్ఎస్వో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్, కల్వకుర్తి టీజేఏసీ చైర్మన్ సదానంద్ గౌడ్, రంగారెడ్డి జిల్లా నాయకులు మహేందర్, రాజు, తలకొండపల్లి టీఎస్ఎస్వో మండలాధ్యక్షుడు బాలు, ఉపాధ్యక్షుడు గణేష్ తదితరులు పరామర్శించారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/tsso-2ff.jpg?resize=640%2C391&ssl=1)