![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/MEDAK-MPDO.jpeg?fit=689%2C576&ssl=1)
సారథి న్యూస్, నారాయణ ఖేడ్: ఉపాధి పనులు కల్పించాలంటూ కంగ్టి మండల కేంద్రంలో కూలీలు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. మండలంలోని పలు గ్రామాల్లో కొద్ది రోజులు మాత్రమే పనులు చేపట్టి ఆ తర్వాత నిలిపివేయడం సరికాదని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పనులకు సంబంధించిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు, ప్రజలు పాల్గొన్నారు.