Breaking News

ఉద్యమంలా గ్రీన్​ ఛాలెంజ్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ ప్రారంభించిన ‘గ్రీన్​ ఇండియా చాలెంజ్’​ ఉద్యమంలా కొనసాగుతున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఆయన గ్రీన్​ చాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అక్కడి ఆలయ ప్రాంగణంలోనూ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్​, మాధవరం కృష్ణారావు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకులు. మర్రి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి. మున్సిపల్ చైర్మన్లు. సర్పంచులు. ప్రజా ప్రతినిధులు. ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.