![ఉత్సాహంగా గ్రీన్ ఇండియా చాలెంజ్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/green-2.jpg?fit=560%2C821&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గాయకుడు దినకర్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన తబలా విద్వాంసుడు జైపాల్ రాజ్ ఆదివారం జూబ్లీహిల్స్ లో తన కుమారుడు ఎబినేజర్ పాల్ తో కలిసి మొక్కలు నాటారు. అందరం ఆరోగ్యంగా ఉండాలంటేనే మొక్కలను నాటాలన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గాయకులు విజయలక్ష్మి, కౌసల్య, ఆర్పి పట్నాయక్, రమణ, లీనస్ మొక్కలు నాటాలని చాలెంజ్ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.