Breaking News

ఇద్దరు చైన్​ స్నాచర్స్​ అరెస్ట్​

సారథిన్యూస్, రామడుగు: ఒంటరి మహిళలను టార్గెట్​ చేసుకొని చైన్​స్నాచింగ్​ పాల్పడుడుతున్న ఇద్దరు దొంగలను రామడుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 51 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి సీఐ రమేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన వేముల రమేశ్​(23), వేముల నర్సింహులు(19) జల్సాలకు అలవాటుపడి చైన్​స్నాచింగ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఎస్సై అనూష రామడుగు చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా వీరిద్దరు అనుమానస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాలు చేసినట్టు అంగీకరించారు. దీంతో వీరిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.