Breaking News

ఆ యాప్​ల నిషేధం కరెక్టే

వాషింగ్టన్‌: భారత్​లో చైనా యాప్​లను నిషేధించడం సరియైన చర్యేనని అమెరికా సమర్థించింది. టిక్​టాక్​, షేర్​ఇట్​ సహా మొత్తం 59 చైనా యాప్​లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో స్పందించారు. సమగ్రత, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత్​లో కొన్ని హానికరమైన యాప్​లను నిషేధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్‌ మీడియా బ్లాగింగ్‌ సైట్‌ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడంపై భారత్‌లో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జీ రోంగ్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై తమ దేశం తీవ్రంగా కలత చెందుతోందని, ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.