![ఆఫీసు అయింది హాస్పిటల్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/OFFICE-TO-HOSPITAL.jpg?fit=650%2C400&ssl=1)
గుజరాత్ : గుజరాత్లోని సూరత్కు చెందిన ఖాదర్ షేక్ కరోనా వైరస్ సోకి ప్రయివేట్ హాస్పిటల్లో చేరాడు. 20 రోజుల పాటు ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న తర్వాత వారు వేసిన బిల్లు చూసి బిత్తర పోయాడు. ఇలా అయితే పేద ప్రజలు ఎలా వైద్యం చేయించుకుంటారా అనే ప్రశ్న అతన్ని తొలచింది. దీంతో తన ఆఫీసునే హాస్పిటల్గా మార్చేశాడు. 85 బెడ్లను ఏర్పాటు చేశాడు. స్థానిక అధికారుల నుండి అనుమతి తీసుకున్నాడు. వైద్య సిబ్బంది, యంత్రాలు, మెడిసిన్ ప్రభుత్వం పంపించింది. ఖాదర్ షేక్ బెడ్లతోపాటు కరెంట్ బిల్లు ఖర్చులను భరించాడు. తన హాస్పిటల్లో కులం, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా చేరవచ్చునని బెబుతున్నాడు.