Breaking News

ఆఫీసుల్లో కాగిత రహిత సేవలు

ఆఫీసుల్లో కాగిత రహిత సేవలు

సారథి న్యూస్, మెదక్: మెదక్ ​జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాయాలను కాగిత రహిత(ఈ ఆఫీస్​) ఆఫీసులుగా మార్చాలని జిల్లా అడిషనల్ ​కలెక్టర్ నగేష్ ​సూచించారు. శనివారం కలెక్టరేట్ లో ఈఆఫీస్​ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని పనులకు పేపర్లను వినియోగిస్తున్నామని చెప్పారు. మెదక్ ​కలెక్టరేట్​ను ఈఆఫీస్ గా మార్చామన్నారు. ఈసేవ, మీ సేవ తరహాలోనే వీటిని నిర్వహించాలన్నారు. అధికారులు సంతకాలను సైతం డిజిటల్ సిగ్నేచర్ ​కీ (డీఎస్​కీ) తయారు చేయించాలని, ఏదైనా సంతకం ఉంటే ఆన్​లైన్​లోనే లాగిన్​ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్​ఐసీ జిల్లా మేనేజర్​సందీప్, ఐటీఈ అండ్​సీ డిపార్టుమెంట్, ఎన్ఐసీ సిబ్బంది పాల్గొన్నారు.