Breaking News

ఆగస్టు​లో శ్రీలంక టూర్​

ముంబై: టీమిండియా క్రికెటర్లు ఇంకా ఔట్​డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టకపోయినా.. ఆగస్టు​లో శ్రీలంక పర్యటనను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. 3వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కోహ్లీసేన అక్కడ పర్యటించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. లంకకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా తెలుస్తున్నది.

ఎఫ్టీపీ ప్రకారం ఈ సిరీస్​ను జూన్​లో నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి పెరుగుతుండడతో ఆగస్ట్​కు పొడిగించారు. ఇక ఆగస్టు​లో లంకలో టూరిజం కూడా మొదలుపెట్టాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సిరీస్​కు సులువుగానే అనుమతి వస్తుందని ఎస్ఎల్సీ పెద్ద ధీమాతో ఉంది. మరోవైపు ఈ సిరీస్​ను సజావుగా నిర్వహించడం ద్వారా సెప్టెంబర్​లో జరిగే ఆసియా కప్ కోసం లైన్ క్లియర్ చేసుకోవాలని కూడా లంక బోర్డు భావిస్తోంది. భారత్​తో సిరీస్ ద్వారా లంకకు భారీఆదాయం సమకూరనుంది.