![అలంపూర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/ALAMPUR-POLICEEFF.jpg?fit=729%2C404&ssl=1)
సారథి న్యూస్, అలంపూర్: నేరాలను అరికట్టేందుకు పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘నేనుసైతం’ కార్యక్రమంలో భాగంగా అలంపూర్ చౌరస్తాలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు నారాయణ గౌడ్ ఆర్థికసాయం చేశారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, సీఐ వెంకట్రామయ్య, ఎస్సై మధుసూదన రెడ్డి, ఏఎస్సై అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.