Breaking News

అయోధ్యపై గట్టి నిఘా

అయోధ్యపై గట్టినిఘా

లఖ్‌నవూ: ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్ర పన్నుతోందని కేంద్రనిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దీంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్‌ ప్రకటించారు. అయోధ్యలో భూమిపూజ నిర్వహించే రోజు, జమ్మూకశ్మీర్‌ ఆర్టికల్‌ 370ను రద్దుచేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషీ, ఉమాభారతితో పాటు ఆర్​ఎస్​ఎస్​ అగ్రనేతలు, దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని హెలికాప్టర్‌‌ దిగే సాకేత్‌ మహా విద్యాలయం నుంచి రామ జన్మభూమి స్థలం వరకు ఇప్పటికే భద్రతా దళాలు మోహరించాయి. అలాగే, రామ్‌కోట్‌ ప్రాంత నివాసితుల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక పాస్‌లను సైతం జారీ చేశారు. అలాగే, రోజూ భద్రతా బలగాలు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించడంతో పాటు ఇంటింటికీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు.