![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/GANG-RAPEEEEFF.jpg?fit=700%2C525&ssl=1)
ఓ ఆశ్రమంలో ఉంటున్న మహిళా సాధువుపై (37) నలుగురు దుండగులు లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఘండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. పాత్వారా గ్రామంలోని ఓ అధ్యాత్మిక క్షేత్రానికి నలుగురు దుండగులు అక్రమంగా చొరబడ్డారు. అక్కడ ఉంటున్న ఓ సాద్వి ని గదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులను అడ్డుకోబోయిన మరో ఇద్దరు మహిళలను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్ననాలుదగవ నిందితుడి కోసం గాలిస్తున్నారు. జార్ఘండ్లో శాంతిభద్రతలు క్షణిస్తున్నాయని.. హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిద్రపోతోందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శించారు.