![కరోనాతో మాజీ క్రికెటర్ కన్నుమూత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/SANJA-2-F.jpg?fit=258%2C248&ssl=1)
న్యూఢిల్లీ: కరోనా మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. ఢిల్లీ క్లబ్ మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ (53).. వైరస్ బారినపడి మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. దోబల్ పెద్ద కుమారుడు సిద్ధాంత్.. రాజస్థాన్ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడుతుండగా, చిన్న కుమారుడు ఎకాన్ష్ ఢిల్లీ అండర్–23 టీమ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్లబ్ క్రికెట్లో ప్రముఖ క్రికెటర్గా ఉన్న దోబల్.. ఢిల్లీ అండర్–23 టీమ్కు సహాయక సిబ్బందిగా కూడా పనిచేశాడు. దీర్ఘకాల వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న సమయంలో దోబల్ వైరస్ బారిన పడినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మూడు వారాల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని బహుదూర్ రోడ్ లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పాజిటివ్గా తేలడంతో మంచి వసతులు ఉన్న ద్వారక ఆస్పత్రికి తరలించి ప్లాస్మా చికిత్స అందజేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది.