Breaking News

సింగరేణిలో బొగ్గు విక్రయాలకు పోర్టల్​

సారథిన్యూస్​, గోదావరిఖని: బొగ్గును విక్రయించేందుకు సింగరేణి సంస్థ ప్రత్యేకపోర్టల్​ను ప్రారంభించింది. విదేశీ బొగ్గు దిగుమతికి బదులుగా స్వదేశీ బొగ్గు వినియోగం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారిక వెబ్​సైట్​లో ఓ ప్రత్యేక పోర్టల్​ను ప్రారంభించినట్టు సింగరేణి డైరెక్టర్​ (ప్లానింగ్, ప్రాజెక్ట్స్‌) భాస్కర్​రావు, ఆపరేషన్స్​ డైరెక్టర్​ చంద్రశేఖర్​ తెలిపారు. ఈ పోర్టల్‌ కు సంబంధించిన వివరాల కోసం www.scclmines.com వెబ్​సైట్​ను కానీ 040-23142219 నంబర్​ లో కానీ సంప్రదించాలని కోరారు. సింగరేణి సంస్థ వినియోగదారుల అభీష్టం మేరకు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు జే ఆల్విన్​, జీఎం కే రవిశంకర్​, జీఎం నాగభూషన్​రెడ్డి, జీఎం వెంకటేశ్వర్​రెడ్డి, డీజీఎం ఎన్వీ రాజశేఖర్​, డీజీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.