![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/sdnr.jpg?fit=1040%2C520&ssl=1)
సారథి న్యూస్, షాద్నగర్: ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీని కలెక్టర్ అమోయ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక సోలీపూర్, హాజిపల్లి రోడ్డులో చేపట్టిన పారిశుద్ధ్య పనులు, ఫరూఖ్ నగర్ లోని జానమ్మ చెరువును పరిశీలించారు. చెరువు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ లావణ్య కలెక్టర్ కు వివరించారు. హరితహారంలో పట్టణంలో విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్య పనులను పూర్తిస్థాయిలో చేపట్టి సీజనల్ వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.