![venkanna](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/VENKANNA.jpg?fit=299%2C359&ssl=1)
సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి) : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సురాబాద్ డివిజన్ కు చెందిన కందికంటి వెంకన్న ఈ నెల 20న బెంగళూరులో డాక్టరేట్ స్వీకరించనున్నారు. గత కొన్నేండ్లుగా ఆయన ఎన్నో సేవాకార్యక్రమాలను నిర్వహించారు. వీటిని గుర్తించిన ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ వెంకన్నకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నదని ఉమ్మడి తెలుగు రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆకుల రమేశ్ తెలిపారు. యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ కే ఆశోక్ కుమార్, వీసీ, ప్రముఖుల ఆధ్వర్యంలో వెంకన్న డాక్టరేట్ ను అందుకోనున్నారు.