Breaking News

మంచి ధాన్యమే తీసుకురండి

కూలీలకు మాస్క్ లు పంపిణీ చేస్తున్న ఎంపీ రాములు

సారథి న్యూస్, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్, తెల్కపల్లి మండలం రాకొండ గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను నాగర్ కర్నూల్ ఎంపీ ఎంపీ పి.రాములు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తేమ, నాణ్యత కలిగిన ధ్యానాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

అలాగే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుందని ప్రజలంతా మాస్క్ లు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. అలాగే గట్టుతుమ్మెన్ గ్రామంలో హమాలీలకు మాస్క్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామల సర్పంచ్ లు తిరుపతి రావు, నరేందర్ గౌడ్, బల్మూర్ మాజీ ఎంపీపీ కర్ణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.