Breaking News

బొగ్గుగనులు ప్రైవేట్​పరం కానివ్వం

సారథిన్యూస్​, గోదావరిఖని: బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ నాయకులు డిమాండ్​ చేశారు. లేదంటే కేంద్రం మెడలు వంచైనా నిర్ణయం వెనక్కి తీసుకోనేలా చేస్తామన్నారు. జాతీయ సంఘాలతోకలిసి దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్​ ఇంతవరకు స్పందించకపోవటం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వై గట్టయ్య, నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, మడ్డి ఎల్లా గౌడ్, జీ గోవర్ధన్, రంగు శ్రీను, నాగేందర్, భోగి సంతోష్ బాబు, బి భాస్కర్, గంగారపు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.