సారథి న్యూస్, బిజినేపల్లి: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని ఆయన చాంబర్లో కలిశారు. బిజినేపల్లి గురుకులాన్ని వనపర్తి జిల్లా కేంద్రానికి తరలించవద్దని కోరారు. ప్రస్తుతం మండల కేంద్రంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూలులో తరగతి గదులతో పాటు టాయిలెట్స్, డైనింగ్ హాల్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ పనులు పూర్తయ్యాయని సెక్రటరీ దృష్టికి తెచ్చారు. అన్నివిధాలుగా అభివృద్ధి చెందిన మండలంలో విద్యావ్యవస్థ ప్రతిష్ట కోసం కృషిచేయాలని కోరారు. పేరెంట్స్కోరిక మేరకు బిజినేపల్లిలోనే కొనసాగించాలని కోరారు. అందుకు గురుకులాల సెక్రటరీ డాక్టర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్సానుకూలంగా స్పందించినట్లు ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురుకుల స్కూలును ఇక్కడే కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
- September 22, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- BIJINEPALLY
- GURUKULAM
- RS PRAVEENKUMAR
- ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
- గురుకులాలు
- బిజినేపల్లి
- Comments Off on బిజినేపల్లి గురుకులాన్ని ఇక్కడే కొనసాగించండి