![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/basara.jpeg?fit=425%2C280&ssl=1)
సారథి న్యూస్, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. అకాడమిక్ బ్లాక్ క్లాస్ రూమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో క్లాస్ రూమ్ లోని ఫర్నిచర్, ప్రొజెక్టర్, సుమారు 60 నుంచి70 చైర్లు, 21 టేబుళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. క్యాంపస్ మొత్తం పొగలతో కమ్ముకుంది. అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించింది. తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.ఘటనపై ఆరా తీస్తున్నారు.