Breaking News

ఫ్యాన్ అయిపోయాడట

ఫ్యాన్​ అయిపోయాడట

ఈ ఏడాది సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది విడుదలైన అన్ని సినిమాల కంటే కలెక్షన్ల విషయంలోనూ ముందుంది ఈ సినిమానే. సినిమా నిర్మాతలత పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి లాభాలు గడించారు. అయితే ఇటీవల తెలుగులో రిలీజైన ప్రతి సినిమాపై దృష్టి పెడుతున్నారు బాలీవుడ్ డైరెక్టర్లు.. హీరోలు. ఇక అక్కడి నిర్మాతలైతే సినిమా హిట్ అయితే ఎంత డబ్బు పెట్టి కొనడానికైనా సిద్ధపడిపోతున్నారు. అయితే ఈ సినిమా కేవలం టాలీవుడ్ లోనే రూ.150 కోట్ల మేర వసూలు చేసింది. అందుకే ఈ సినిమా నిర్మాణ హక్కులను భారీ ధర వెచ్చించి అశ్విన్ వర్దె అనే సొంతం చేసుకున్నాడు.

తాజాగా అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాను బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా చూశారంట. సినిమా తెగ నచ్చేసిందట ఆయనకు. అల్లు అర్జున్ని పొగిడేయడమే కాదు.. ఈ సినిమాతో బన్నీకి పెద్ద ఫ్యాన్ అయిపోయారట. నెట్ ఫ్లిక్స్ లో సినిమా చూసిన సంజయ్ గుప్తా.. ఆ వెంటనే ట్విట్టర్ ద్వారా ‘సినిమా అద్భుతంగా ఉందని.. ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్ తెగ నచ్చిందని’ తెలిపాడు. దానికి బన్నీ స్పందించి ‘మా సినిమా చూసినందుకు ధన్యవాదాలు సార్. మీకు నచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంది’ అన్నాడు. మళ్లీ సంజయ్ స్పందించి.. ‘‘మీకు నటనకి నేను చాలా కనెక్ట్ అయిపోయా. మీ అభిమానిగా మారిపోయాను. కరోనా ముగిస్తే థియేటర్​లో చూస్తా. అలాగే మీతో కలిసి వర్క్ చేయాలని ఎంతో ఆత్రంగా ఉంది..”అంటూ చేసుకున్న వీళ్లిద్దరి చాటింగ్ ప్రస్తుంత నెట్టింట తెగ వైరల్ అవుతోంది.