- ఉద్యోగులకు 50శాతం జీతం నాలుగు విడతలుగా చెల్లింపు
- ఉత్తర్వులు జారీచేసిన ఆర్థిక శాఖ
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి.. లాక్డౌన్ నేపథ్యంలో కోత విధించిన వేతన బకాయిల చెల్లింపుల విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్ లో రెండు విడతలుగా చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. అధికారులు, సిబ్బందికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో మూడు విడతలుగా చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెన్షనర్లకు సంబంధించి వాయిదావేసిన మొత్తాన్ని అక్టోబర్, నవంబర్ వాయిదాల చొప్పున చెల్లిస్తారు. అఖిలభారత సేవా సర్వీసుల అధికారులకు సంబంధించి, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాలుగవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హోనోరియం, ఇతర ఉద్యోగులు, ఎన్నికైన ప్రతినిధులకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో నాలుగు విడతలుగా నగదు రూపంలో చెల్లించనున్నారు.