సారథి న్యూస్, హైదరాబాద్: జోగిని స్వర్ణలత చెప్పిన రంగం భవిష్యవాణిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు తీవ్ర హెచ్చరికలు చేశారు. మున్ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరు చేసుకున్నదానికి వాళ్లు అనుభవించక తప్పదు కదా! అని అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమన్ని నిర్వహించారు. అమ్మవారు ఆవహించిన స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కరోనాను కట్టడి చేయడానికి తాను ఉన్నానని.. భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయమని ఆజ్ఞాపించారు. ప్రతి గడప నుంచి శాక, పప్పుబెల్లాలు రావాలన్నారు. కామంతో కాకుండా, భక్తిభావనతో చేసినట్లయితే తప్పకుండా కాపాడతానన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవన్నారు. ప్రజలందరినీ తాను కాపాడతానని, కరోనాపై పోరాడతానని తెలిపారు. రాబోయే రోజులు కష్టాలతో ఉంటాయని హెచ్చరించారు.
- July 13, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- హైదరాబాద్
- UJJAINI MAHAKALI
- ఉజ్జయిని మహంకాళి
- కరోనా
- భవిష్యవాణి
- Comments Off on ప్రజలందరినీ కాపాడతా..