Breaking News

పెట్రో ధరలు తగ్గించండి

పెట్రో ధరలు తగ్గించండి

సారథి న్యూస్, చొప్పదండి: ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభన కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజల్,పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలు కరీంనగర్​జిల్లా చొప్పదండి ఎన్టీఆర్​చౌరస్తా నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వరకు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్​రజితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గ ఇన్​చార్జ్​మేడిపల్లి సత్యం, పట్టణాధ్యక్షుడు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ముద్దం తిరుపతి, గుర్రం రమేష్ పాల్గొన్నారు.