![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/ANASUYA-NEWWWFFFG.jpg?fit=700%2C482&ssl=1)
సుశాంత్ ఆత్మహత్య అనంతరం నెపోటిజం(బంధుప్రీతి) ప్రధానంగా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా బుల్లితెర యాంకర్ అనసూయ స్పందించారు. ‘ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. నేను కూడా నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా. కానీ ఆ తర్వాత నా టాలెంట్తో అవకాశాలు దక్కించుకున్నా’ అని చెప్పింది అనసూయ. ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదనే ఎప్పుడూ ఈ విషయం బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. తప్పకుండా మాట్లాడుతా. కష్టాన్ని నమ్ముకుంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు’ అని అనసూయ చెప్పుకొచ్చారు.