Breaking News

నీటిచౌర్యం చేస్తే కేసులే

సారథి న్యూస్​, మహబూబాబాద్: మంచి నీటిని చౌర్యం చేస్తే కేసులు పెట్టాలని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్​ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని గార్ల మండలం సీతంపేటలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. గ్రామస్తులు తాగునీటి కష్టాలను కలెక్టర్​ దృష్టికి తెచ్చారు. తక్షణమే సర్పంచ్​లతో మీటింగ్​ పెట్టి ఏర్పాటు చేయాలని గార్ల ఎంపీడీవో ఆదేశించారు. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ఇంకుడుగుంతలు తవ్వుకోవాలని సూచించారు. డంపింగ్​ యార్డును కంప్లీట్​ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో సన్యాసయ్య, తహసీల్దార్​ ఆర్.విజయ్ కుమార్, ఎంపీడీవో రవీందర్ పాల్గొన్నారు.