![నిలోఫర్ మాజీ సూపరింటెండెంట్ సుదర్శన్ రెడ్డి మృతి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/suda.jpeg?fit=338%2C400&ssl=1)
- చిన్నపిల్లల డాక్టర్గా విశేష గుర్తింపు.
సారథి న్యూస్, హైదరాబాద్ : నిలోఫర్ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్, ప్రముఖ వైద్యులు డాక్టర్ పట్లోళ్ల సుదర్శన్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. ఉస్మానియా మెడికల్ కాజీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. నిలోఫర్ ఆస్పత్రికి సూపరింటెండెంట్ పనిచేసి నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఖైరతాబాద్ లో క్రిష్ణ చిల్డ్రన్స్ క్లీనిక్ ను కొనసాగిస్తూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో కూడా ఆయన సేవలందించారు. కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతూ హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా సుదర్శన్రెడ్డి విశేష గుర్తింపు పొందారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.